తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు
WhatsApp Channel Join Now

Saturday, July 18, 2026

తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు

 ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.